Asia Cup T20: తక్కువ పరుగులకి ఔటైన రిషబ్ పంత్.. బాలీవుడ్ నటిని ఆడేసుకుంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-09-05T17:06:58+05:30 IST

భారతదేశంలో క్రికెట్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా దుబాయ్‌లో ఆసియా కప్ (Asia Cup) టీ20 2022 టోర్నీ జరుగుతోంది...

Asia Cup T20: తక్కువ పరుగులకి ఔటైన రిషబ్ పంత్.. బాలీవుడ్ నటిని ఆడేసుకుంటున్న నెటిజన్లు!

భారతదేశంలో క్రికెట్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా దుబాయ్‌లో ఆసియా కప్ (Asia Cup) టీ20 2022 టోర్నీ జరుగుతోంది. ఇందులో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ దాయాదుల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రికెట్ లవర్స్‌కి చాలా ఇంట్రస్ట్ ఉంటుంది. ఆదివారం (సెప్టెంబర్ 4న) ఈ రెండు దేశాల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్, భారత్‌పై విజయం సాధించింది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 181 పరుగులు చేసి.. పాక్ ముందు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని చేధించి పాక్ విజేతగా నిలిచింది. అయితే.. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (Rishabh Pant) తక్కువ పరుగులకు ఔటయ్యారు. ముఖ్యంగా రిషబ్ అలా ఔటవ్వడంతో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు.












ఊర్వశికి, రిషబ్‌కి సోషల్ మీడియా వేదికగా జరిగిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి రిషబ్ ఆడే మ్యాచ్‌కి ఊర్వశి హాజరైప్పుడల్లా చాలామంది కాన్‌సన్ ట్రేషన్ ఆ బ్యూటీపైనే ఉంటోంది. తాజాగా జరిగిన మ్యాచ్‌కి సైతం ఊర్వశి హాజరైంది. కానీ రిషబ్ తక్కువ పరుగులకే ఔటవ్వడం ఈ బాలీవుడ్ భామపై విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో.. ‘ఊర్వశిని స్టేడియంకి రాకుండా బ్యాన్ చేయాలి’ అంటూ కొందరు.. ‘రిషబ్ కోసమే వచ్చిందా’ అంటూ మరికొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరైతే.. ‘ఊర్వశి లైమ్‌లైట్‌లో ఉండటానికే కొన్ని పనులు చేస్తుంది. ఆమె అనుకున్నట్లుగానే అందరూ ట్రెండ్ చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-09-05T17:06:58+05:30 IST