నా మౌనాన్ని అంగీకారంగా చూడొద్దు.. సమంత సంచలన ట్వీట్

ABN , First Publish Date - 2022-04-23T00:22:28+05:30 IST

‘‘నా నిశ్శబ్దాన్ని తెలియనితనంగా.. నా మౌనాన్ని అంగీకారంగా.. నా దయని బలహీనతగా ఎప్పుడూ చూడకండి.. దయకి కూడా ఒక ముగింపు తేదీ ఉంటుంది’’ అంటూ స్టార్ హీరోయిన్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో..

నా మౌనాన్ని అంగీకారంగా చూడొద్దు.. సమంత సంచలన ట్వీట్

‘‘నా నిశ్శబ్దాన్ని తెలియనితనంగా.. నా మౌనాన్ని అంగీకారంగా.. నా దయని బలహీనతగా ఎప్పుడూ చూడకండి.. దయకి కూడా ఒక ముగింపు తేదీ ఉంటుంది’’ అంటూ స్టార్ హీరోయిన్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆమె దేనిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసి ఉంటుందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ప్రస్తుతం ఆమె విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటిగా మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఈ పాటలలో ఆమె గ్లామర్ ప్రదర్శన హాట్ టాపిక్ అవుతుంది. ఈ విషయంపై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఆమె అలా స్పందించిందా? లేదంటే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సమంత హాజరు కాలేదని.. హీరో విజయ్ దేవరకొండ చేసిన పని ఆమెకు నచ్చలేదా?

 

సమంత, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణల ఫొటోలను ఓపెనింగ్‌కు వచ్చినట్లుగా విజయ్ దేవరకొండ ఫొటోషాప్ ద్వారా క్రియేట్ చేసి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరో అయిన తన సినిమా ఓపెనింగ్‌కి వారు రాలేదని హర్టయ్యి అలా చేశాడో.. లేదంటే వారు కూడా ఉండి ఉంటే బాగుండేది అని చేశాడో తెలియదు కానీ.. రౌడీ హీరో విజయ్ చేసిన ఈ పని మాత్రం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో కొందరు ఓపెనింగ్‌కి రాని వారిపై నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. మరి ఆ నెగిటివ్ కామెంట్స్‌పై సమంత ఇలా రియాక్ట్ అయిందో.. లేదంటే ఇంకా వేరే ఏదైనా విషయం ఉందో తెలియదు కానీ.. ఆమె చేసిన పోస్ట్‌పై మాత్రం హాట్ హాట్‌గా చర్చలైతే నడుస్తున్నాయి.



Updated Date - 2022-04-23T00:22:28+05:30 IST