‘పూలరంగడు’ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-10T22:34:29+05:30 IST

ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడింది. తాజాగా ఆమె సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో డాక్టర్ల సలహాలతో చికిత్స పొందుతున్నట్లుగా తెలిపిన

‘పూలరంగడు’  హీరోయిన్‌కు కరోనా పాజిటివ్

‘ప్రేమకావాలి’ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమై.. ‘పూలరంగడు’, ‘మిస్టర్ పెళ్ళికొడుకు’, ‘జంప్ జిలాని’, ‘శ్రీమన్నారాయణ’ వంటి అనేక చిత్రాలలో నటించి.. హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇషా చావ్లా. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడింది. తాజాగా ఆమె సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో డాక్టర్ల సలహాలతో చికిత్స పొందుతున్నట్లుగా తెలిపిన ఇషా చావ్లా.. ప్రజలందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది. కాగా, ప్రస్తుతం ఆమె కబీర్ లాల్ దర్శకత్వంలో 6 భాషల్లో రూపొందుతోన్న ‘దివ్య దృష్టి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Updated Date - 2022-01-10T22:34:29+05:30 IST