విజయ్, వంశీ పైడిపల్లి కాంబో చిత్రానికి హీరోయిన్ ఫిక్స్

ABN , First Publish Date - 2022-04-06T02:56:35+05:30 IST

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో తలపతి విజయ్. ఆయన హీరోగా.. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై

విజయ్, వంశీ పైడిపల్లి కాంబో చిత్రానికి హీరోయిన్ ఫిక్స్

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో తలపతి విజయ్. ఆయన హీరోగా.. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఓ చిత్రాన్ని నిర్మించ‌బోతోన్న విషయం తెలిసిందే. ఇది విజయ్‌కి 66వ చిత్రం. తాజాగా ఈ చిత్రంలో విజయ్ సరసన నటించే హీరోయిన్‌ని ఫిక్స్ చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించ‌నున్న‌ట్లు.. ఆమె పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి వంశీ ఓ పవర్ ఫుల్ స్ర్కిప్ట్‌ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.



Updated Date - 2022-04-06T02:56:35+05:30 IST