రష్యాతో యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో బాలీవుడ్ మూవీ షూటింగ్.. ముగ్గురు నటుల మిస్సింగ్..

ABN , First Publish Date - 2022-04-26T16:56:56+05:30 IST

గత రెండు నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్ కారణంగా ఉక్రెయిన్‌లోని..

రష్యాతో యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో బాలీవుడ్ మూవీ షూటింగ్.. ముగ్గురు నటుల మిస్సింగ్..

గత రెండు నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్ కారణంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలు, ధ్వంసమవగా ఎంతోమంది పౌరులు నిరాశ్రయులుగా మారారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో అక్కడ ‘లవ్ ఇన్ ఉక్రెయిన్’ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న నటి ఏలిజా ఓ చోట చిక్కుకుపోయింది. అలాగే ముగ్గురు నటులు మిస్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఉక్రేనియన్ అమ్మాయి, భారతీయ అబ్బాయి మధ్య జరిగిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రానికి నితిన్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఎక్కువ భాగం యుద్ధం ప్రారంభమయ్యే నాటికి షూటింగ్ పూర్తయింది. దీని గురించి నితిన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో 90 శాతం మంది ఉక్రెనియన్ యాక్టర్సే నటించారు. సినిమాకి సంబంధించి మేజర్ పార్ట్‌ని యుద్ధానికి ముందే పూర్తి చేశాం. కానీ.. కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది. దీంతో యుద్ధ సమయంలోనే ప్రభుత్వం అనుమతితో షూటింగ్ చేశాం. అందులో ఏ భారతీయ ఆర్టిస్టు నటించలేదు. అయితే ఈ ప్యాచ్ వర్క్ జరుగుతున్న సమయంలో ముగ్గురు నటులు మిస్ అయ్యారు. వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన కుదరట్లేదు. అంతేకాకుండా ఇందులో హీరోయిన్‌గా నటించిన ఎలిజా అక్కడే స్టక్ అయిపోయింది. మూవీ ప్రమోషన్స్ కోసం ఆమెని భారత్‌కి రప్పించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ కుదరట్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.


నితిన్ ఇంకా మాట్లాడుతూ.. ‘యుద్ధ సమయంలోనూ షూటింగ్ కొనసాగించేలా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మమ్మల్ని ప్రొత్సహించారు. అంతేకాకుండా యుద్ధానికి ముందు పరిస్థితులు కొంచెం ఉద్రిక్తంగా ఉండడంతో మాకు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఆరెంజ్ చేశారు. అయితే.. గతం నుంచి పరిస్థితులు ఇలాగే ఉండడం వల్ల వార్ జరగదనే మేం అనుకున్నాం. కానీ.. యుద్ధం ప్రారంభమైంది. అయితే అప్పటికే మా షూటింగ్ పూర్తవ్వడం బయట పడగలిగాం. అయినప్పటకీ అక్కడి నటులతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం’ అని తెలిపాడు.



Updated Date - 2022-04-26T16:56:56+05:30 IST