బిజినెస్మేన్కు బ్రేకప్ చెప్పి.. నటుడితో డేటింగ్ చేస్తోన్న అమీ జాక్సన్..!
ABN , First Publish Date - 2022-02-17T22:51:33+05:30 IST
మోడల్గా కెరీర్ను ప్రారంభించి అనంతరం నటిగా మారిన సుందరి అమీ జాక్సన్
మోడల్గా కెరీర్ను ప్రారంభించి అనంతరం నటిగా మారిన సుందరి అమీ జాక్సన్. ఆర్య సరసన ‘మద్రాస్ పట్టణం’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఎవడు’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. నటిగా స్టార్డమ్ను అనుభవిస్తున్న దశలోనే జార్జ్ పనియోటౌ అనే బిజినెస్మేన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ జంట కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. వీరికి అండ్రూ అనే బాబు జన్మించాడు. జార్జ్ని పెళ్లి చేసుకుందామని 2020లో అమీ జాక్సన్ అనుకుంది. కరోనా ఆంక్షలతో వీరి వివాహం వాయిదా పడింది. ఏమైందో తెలియదు కానీ అనివార్య కారణాల వల్ల గతేడాది వీరిద్దరూ విడిపోయారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.
అమీ జాక్సన్ మరోసారి కొత్తగా తన ప్రియుడిని వెతుకున్నట్టు తెలుస్తోంది. బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్విక్తో ఆమె రెండు నెలలుగా రహస్యంగా డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సౌదీ అరేబియాలో రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలల నుంచి సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. లండన్ వీధుల్లో అనేక సార్లు వీరు కెమెరా కంట కూడా పడ్డారు. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్లో ఈ జంట వాలంటైన్స్ డేని జరుపుకొన్నారు.