అమలా పాల్ దృష్టంతా.. ఇప్పుడు వాటిపైనే!
ABN , First Publish Date - 2022-01-25T03:25:47+05:30 IST
టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన అమలా పాల్ కెరీర్ ఇపుడు కష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఆమె వివాహం, విడాకులు తర్వాత సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో ఆమెకు పెద్దగా అవకాశాలు
టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన అమలా పాల్ కెరీర్ ఇపుడు కష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఆమె వివాహం, విడాకులు తర్వాత సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె వెబ్ సిరీస్లపై దృష్టిసారించింది. ప్రస్తుతం ఆమె ‘రంజిష్ హై సాహి’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె బిజీబిజీగా గడుపుతోంది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉన్న సమయంలో టైమ్ చాలా వేగంగా గడిచిపోతుందని అంటుంటారు. ఆమ్నా పర్వేజ్ పాత్రకు ప్రాణం పోసేందుకు ఎంతో శ్రమించాను. నాకు సరైన సమయం లభించింది. నేను చేయదలచుకున్న పనిని ఇష్టపడేందుకు, అమితంగా ఇష్టపడినదాన్ని పూర్తి చేసేందుకు ఎంతో బాగుంది’’ అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వెబ్ సిరీస్లను బాగా ఇష్టపడుతోంది.. అందుకే వాటిపైనే దృష్టిపెట్టింది అనేలా కామెంట్స్ పడుతున్నాయి.