ఈ పాండమిక్ చాలా మార్పు తెచ్చింది: హీరో సూర్య

ABN , First Publish Date - 2022-03-06T01:21:40+05:30 IST

విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులందరినీ ఈ పాండమిక్ మార్చేసిందని అన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈటి’. సన్ పిక్చర్స్ పతాకంపై పాండిరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 10న ఈ చిత్రం..

ఈ పాండమిక్ చాలా మార్పు తెచ్చింది: హీరో సూర్య

విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులందరినీ ఈ పాండమిక్ మార్చేసిందని అన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈటి’. సన్ పిక్చర్స్ పతాకంపై పాండిరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సూర్య.. చిత్ర విశేషాలను తెలుగు మీడియాకు వివరించారు.


ఆయన మాట్లాడుతూ..

‘‘పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు వచ్చింది. ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి. ఫ్యామిలీతో ఎలా గడపాలనేది పాండమిక్ తెలిపింది. నా బంధువులు కూడా తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి జూమ్లో మాట్లాడుకునేవారు. ఈ పాండమిక్ బిజినెస్ పరంగా పర్యాటక రంగాన్ని, ఆసుపత్రులను పూర్తిగా మార్చేసింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో జరగలేదు.. ఏడాదిన్నర కాలం చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సైకిల్ షాప్ ఓనర్ రెండున్నర ఏళ్ళు ఒక్క సైకిల్ కూడా అమ్మలేదట. ఆ తర్వాత మూడు నెలల్లో ఆఫర్లు వస్తే అమ్మడానికి సరుకులేదు. ఇలా వైవిధ్యమైన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా సినిమా రంగంలోనూ పెను మార్పులు వచ్చాయి. నేను నటించిన ‘ఆకాశం నీ హద్దురా, జై భీమ్’ సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి. కలకత్తా నుంచి కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు.


డిజిటల్ బిజినెస్ నిర్మాతలకు బూస్ట్ ఇచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. పాండమిక్ తర్వాత పుష్ప, భీమ్లానాయక్ కూడా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. అలా సినిమాలు పెద్ద వ్యాపారం జరిగేలా పరిస్థితులు అనుకూలించాయి. రాజమౌళి సినిమాలు అన్నిచోట్ల బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది. మలయాళ పరిశ్రమలో కొత్త కంటెంట్‌ని అందరూ చూసి ఆనందిస్తున్నారు. దాంతో పరిశ్రమ మొత్తం మారిపోయింది. ఢిల్లీ నుంచి ముంబై వరకు పలు పొడ్రక్షన్ కంపెనీలు విస్తృతం అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో కొత్త ప్రక్రియ వచ్చేసింది. ఫాంటసీ సినిమాలే కాదు కంటెంట్ సినిమాలకు యూత్ పెద్ద పీట వేస్తున్నారు. విప్లవాత్మకమైన ఈ మార్పులు మరింత పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మంచి సినిమాలు వస్తే శుక్ర, శనివారం, ఆదివారం యూత్ బాగా చూస్తున్నారు. దీంతో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు. పైరసీ అరికట్టి ఓటీటీ కొత్త ఆడియన్స్‌ని తీసుకువచ్చింది. తమిళనాడులో 8 కోట్ల జనాభా వుంటే 80 లక్షల మంది ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. ‘అఖండ, పుష్ప, భీమ్లానాయక్’ చిత్రాలు పాండమిక్ తర్వాత బూస్ట్ ఇచ్చాయి. రేపు రాబోయే ఇ.టి. కూడా అంత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను.


మా 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కార్తీతో పాండిరాజ్ సినిమా తీశాడు. అది ‘చినబాబు’గా తెలుగులో వచ్చింది. పాండిరాజ్ ఫ్యామిలీ సినిమాలు బాగా తీస్తాడు. ఆ సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు చూసి చాలా బాగుందని ట్వీట్ కూడా చేశారు. అలాగే ‘ఈటి’లో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో మంచి నీళ్ళు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు వుండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న చిన్న పొరబాట్లు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.


రాజమౌళి సార్, వాళ్ల ఫాదర్ విలనిజాన్ని హైలెట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. ఈటి చిత్రంలోనూ విలన్ సరికొత్తగా వుంటాడు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ దర్శకుడు బాగా చూపించాడు. ఇప్పటి జనరేషన్ కూడా బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. నా అభిమానులు కూడా నా కథలు, నన్ను బాగా ఫాలో అవుతున్నారు. వారికి మెప్పించే సినిమా ఇదని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకి నేనే తెలుగు డబ్బింగ్ చెప్పాను. అది యాసలో ఉంటుంది. తమిళంలో కూడా ఇలా ఉంటే వెరైటీగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. డైలాగులలో చిన్న చిన్న మార్పులు చేశాం. నా తదుపరి సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు బాలతో ఓ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్‌తో ‘వాడి వాసల్’ సినిమా చేయాలి. అందులో ప్రతి షాట్‌కు కనీసం 500 మంది ఆర్టిస్టులు వుండాలి. అందుకే కరోనా టైంలో అది సాధ్యపడలేదు. జూన్‌లో ప్రారంభించాలని అనుకుంటున్నాం’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-06T01:21:40+05:30 IST