యాక్షన్తో మొదలెట్టారు
ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. వీరిద్దరికీ ఇదే తొలి పాన్ ఇండియా సినిమా.
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. వీరిద్దరికీ ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శుక్రవారం రామోజీ ఫిల్మ్సిటీలో షూటింగ్ మొదలైంది. ఓ భారీ యాక్షన్ సన్నివేశంతో చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇదే షెడ్యూల్లో ఓ మాస్ గీతాన్నీ తెరకెక్కించబోతున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘‘బోయపాటి - రామ్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. వాటిని అందుకొనే సినిమా ఇది. రామ్కి టైలర్ మేడ్ క్యారెక్టర్. మంచి టీమ్ దొరికింది. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడిస్తామ’’ని నిర్మాత తెలిపారు.