Nikhil Siddhartha : టీవీ సీరియల్‌లో నటించి షాకిచ్చాడు !

ABN , First Publish Date - 2022-07-24T18:09:06+05:30 IST

సౌత్ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్‌ను బీటవుట్ చేస్తున్నాయి. అయితే బాలీవుడ్ వారి ప్రమోషనల్ స్ట్రాటజీని మాత్రం మన వాళ్లు ఇప్పుడిప్పుడే అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఎంత టాప్ హీరో అయినా.. తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఒక మెట్టు దిగి.. జనంలోకి రావడానికి ఏ విధంగానూ సంకోచించరు.

Nikhil Siddhartha : టీవీ సీరియల్‌లో నటించి షాకిచ్చాడు !

సౌత్ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్‌ను బీటవుట్ చేస్తున్నాయి. అయితే బాలీవుడ్ వారి ప్రమోషనల్ స్ట్రాటజీని మాత్రం మన వాళ్లు ఇప్పుడిప్పుడే అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.  బాలీవుడ్‌లో ఎంత టాప్ హీరో అయినా.. తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఒక మెట్టు దిగి.. జనంలోకి రావడానికి ఏ విధంగానూ సంకోచించరు. చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోలు క్రేజీ టీవీ షో అయిన బిగ్ బాస్ ను, కపిల్ శర్మ కామెడీ షో, కాపీ విత్ కరణ్ లాంటి షోస్‌ను, సిఐడీ (CID) లాంటి టాప్ రేటెడ్ సీరియల్స్‌ను  తమ సినిమాల ప్రమోషన్స్‌కు బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే టాలీవుడ్ మీడియమ్ రేంజ్ హీరోలు.. ‘జబర్దస్త్’  (Jabardasth) లాంటి షోస్ ను సినిమాల ప్రమోషన్స్ వేదికగా వాడుకుంటున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సీరియల్స్‌లో కూడా నటిస్తున్నారు. 


యంగ్ హీరో నితిన్ (Nithin).. తన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyajakavargam) ప్రమోషన్స్ కోసం ఒక టీవీ సీరియల్‌లో క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నట్టు ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha)  తన తాజా చిత్రం ‘కార్తికేయ 2’  (Karthikeya 2)ప్రమోషన్స్ కోసం..  ప్రముఖ టీవీ ఛానల్2లో ప్రసారం అవుతోన్న ‘రాధమ్మకూతురు’  (Radhamma koothuru) అనే సీరియల్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక మహిళను కాపాడి ఆమెను పెళ్ళి మండపానికి తీసుకెళ్ళే సీన్‌లో నిఖిల్ హీరోలా రెచ్చిపోయి ఫైట్ కూడా చేసేశాడు. మహిళా ప్రేక్షకుల్ని తన సినిమాకి రప్పించేందుకు నిఖిల్ ఇలా తన సినిమా ప్రమోషషన్స్ చేశాడని వేరే చెప్పాలా? అయితే ఇది వర్కవుట్ అయితే.. మిగతా హీరోలు కూడా తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతారేమో. 


ఆగస్ట్ 5న ‘కార్తికేయ 2’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. గుజరాత్ లోని సముద్రగర్భంలో ఇప్పటికీ ఉన్న ద్వారకా నగరం నేపథ్యంలో.. మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తుండగా, శ్రీనివాసరెడ్డి, హర్ష, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా నిఖిల్‌కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-07-24T18:09:06+05:30 IST