ఆ లెక్కలు తర్వాత చూసుకుందాం: హీరో నాని

ABN , First Publish Date - 2021-12-23T22:48:19+05:30 IST

మంచి మంచి విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అనుకుంటున్నాను. ఫస్ట్ కథ విన్నప్పుడే అలాంటి ఫీలింగ్‌ను నేను అనుభూతి చెందాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా

ఆ లెక్కలు తర్వాత చూసుకుందాం: హీరో నాని

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. 


ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. ‘‘విడుదలకు ముందు మీడియాకు థ్యాంక్స్ చెప్పాలని ఈ వేడుకను ఏర్పాటు చేశాం. మాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. రిలీజ్ ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఓ మంచి సినిమా తీశామనే ఓ ఫీలింగ్ మాత్రం ఉంది. సినిమా చూశాక ఆడియెన్స్ ఎలా ఫీల్ అవుతారా? అని రెండు రోజుల నుండి ఆలోచిస్తూనే ఉన్నాను. యూఎస్‌లో ప్రీమియర్స్ పడతాయి. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. అందుకోసం ప్రతీ ఒక్కరం ఎంతో కష్టపడ్డాం. ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనే విడుదల చేస్తున్నాం. మంచి మంచి విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అనుకుంటున్నాను. ఫస్ట్ కథ విన్నప్పుడే అలాంటి ఫీలింగ్‌ను నేను అనుభూతి చెందాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఇందులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. 


వాసు నార్మల్ కారెక్టర్. శ్యామ్ ప్రపంచం వేరు. నేను కూడా ఓ ప్రేక్షకుడినే. నాకు నచ్చింది ప్రేక్షకుడికి నచ్చుతుందనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాలు చేయాలని అనిపిస్తుంది. సినిమాను ఎంత బాగా చూపించామనేది ముఖ్యం. ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లామా? లేదా? అనేదే ప్రేక్షకులు చూస్తారు. ఏ భాషలోని ప్రేక్షకులు చూసినా కూడా భాషలో తప్పు కనిపించకూడదని బెంగాలీ భాషను నేర్చుకున్నాను. డైలాగ్స్ చెప్పాను. కెమెరామెన్, ఆర్ట్, క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్స్ వల్లే నాకు శ్యామ్ సింగరాయ్ ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఫీలింగ్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే అందరూ చెబుతారు. నేను కూడా అదే చెబుతున్నాను. కానీ ఎంతో నమ్మకంగా, కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే దాన్ని దాటే సినిమాను చేశామని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాల పట్ల నిర్మాతలు, నేను అందరం హ్యాపీగానే ఉన్నాం. అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేశాం. కానీ ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. అందుకే ఎంత మంది చూస్తారో చూడండి. నష్టపోతే మేమే నష్టపోతాం. లెక్కలు తర్వాత చూసుకుందాం..’’ అని అన్నారు.

Updated Date - 2021-12-23T22:48:19+05:30 IST