500 మందితో.. గోదావరిఖనిలో నాని ‘దసరా’
ABN , First Publish Date - 2022-04-12T00:17:53+05:30 IST
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నిర్మాత సుధాకర్ చెరుకూరి..
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. హీరో నాని తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన చిత్ర గ్లింప్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నాని బీడీ వెలిగించి సింగరేణిలో తన గ్యాంగ్తో కలిసి వస్తున్న అగ్రెసివ్ యాటిట్యూడ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు సంచలన స్టెప్స్ సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారని.. ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో నాని కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో నడుస్తుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.