మదురై దంపతులకు Hero Dhanush నోటీసులు
ABN , First Publish Date - 2022-05-22T15:33:58+05:30 IST
తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మదురై దంపతులకు హీరో ధనుష్ లాయర్ నోటీసు పంపించారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నందుకు తక్షణం
- సారీ చెప్పకుంటే రూ.10 కోట్ల పరువు నష్టం దావా
అడయార్(చెన్నై): తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మదురై దంపతులకు హీరో ధనుష్ లాయర్ నోటీసు పంపించారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నందుకు తక్షణం క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో రూ.10 కోట్లకు కోర్టులో పరువునష్టం దావా వేస్తామని ఆ నోటీసులో హెచ్చరించారు. మదురై జిల్లా మేలూరు ప్రాంతానికి చెందిన కదిరేశన్ - మీనాక్షి అనే దంపతులు హీరో ధనుష్ తమ కుమారుడంటూ మదురై మేలూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో ఆ దంపతులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో కదిరేశన్ - మీనాక్షి దంపతులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ ధనుష్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం కదిరేశన్ దంపతుల పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కదిరేశన్, మీనాక్షి దంపతులు తాజాగా ధనుష్ తండ్రి కస్తూరీరాజా తమను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఆ దంపతులకు ధనుష్, ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరీరాజా న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు.