‘గీత’ దాటేసిందా?
ABN , First Publish Date - 2022-08-16T05:40:15+05:30 IST
వి.వి.వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘గీత’. మ్యూట్ విట్నెస్ ఉపశీర్షిక. హెబ్బా పటేల్, సునీల్ కీలక పాత్రలు...
వి.వి.వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘గీత’. మ్యూట్ విట్నెస్ ఉపశీర్షిక. హెబ్బా పటేల్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఆర్.రాచయ్య నిర్మాత. ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ‘‘గురువుకి తగిన శిష్యుడు విశ్వ. ఈ చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కించారు. హెబ్బా కెరీర్లో ఇదో మంచి పాత్ర అవుతుంది. సునీల్ నటన ఆకట్టుకుంటుంద’’ని నిర్మాత తెలిపారు. ‘‘ఈ అవకాశం వినాయక్ గారి వల్లే వచ్చింది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇదో సున్నితమైన భావోద్వేగాల మధ్య సాగే కథ. హెబ్బా నటన ప్రధాన ఆకర్షణ’’ అని దర్శకుడు తెలిపారు. రామ్ కార్తీక్, సప్తగిరి, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. సంగీతం: సుభాష్ ఆనంద్.