Karthikeya 2: మెచ్చుకున్న ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-08-30T01:13:40+05:30 IST

‘కార్తికేయ –2’ చిత్రంపై గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణతత్వంతో కూడిని ఈ చిత్రాన్ని చక్కని సందేశంతో దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా చిత్ర కథానాయకుడు నిఖిల్‌, నిర్మాతల్లో ఒకరైన అభిషేక్‌ అగర్వాల్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రిని కలిశారు.

Karthikeya 2: మెచ్చుకున్న ముఖ్యమంత్రి

‘కార్తికేయ –2(Karthikeya 2)’ చిత్రంపై గుజరాత్‌ ముఖ్యమంత్రి(Gujarat Chief Minister) భూపేంద్రభాయ్‌ పటేల్‌ (Bhupendrabhai Patel) ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణతత్వంతో కూడిని ఈ చిత్రాన్ని చక్కని సందేశంతో దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా చిత్ర కథానాయకుడు నిఖిల్‌, నిర్మాతల్లో ఒకరైన అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek agarwal)గుజరాత్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకున్న ఆయన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. 


నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌ సక్సెస్‌ సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ‘కార్తికేయ–2’ 100 కోట్లకు పైగా వసూలు చేసి దేశమంతా సంచలనం సృష్టించింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. 


Updated Date - 2022-08-30T01:13:40+05:30 IST