Geetha Arts: ఇద్దరు దర్శకులకు అడ్వాన్స్!
ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST
స్టార్డమ్, సక్సెస్ ఉన్నవారి చుట్టూనే బడా నిర్మాతలు ప్రదక్షిణలు చేస్తుంటారు. ఓ దర్శకుడికి భారీ విజయం అందితే ముందే కర్చీఫ్ వేస్తుంటారు. దర్శకుడి తీత మీద మరీ నమ్మకం ఉంటే ఓ అడుగు ముందుకేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తుంటారు. కొందరైతే సినిమా విడుదల తర్వాత సక్సెస్ చూసి ఆ దర్శకుడి చేతిలో అడ్వాన్స్ పెడుతుంటారు.
స్టార్డమ్, సక్సెస్ ఉన్నవారి చుట్టూనే బడా నిర్మాతలు ప్రదక్షిణలు చేస్తుంటారు. ఓ దర్శకుడికి భారీ విజయం అందితే ముందే కర్చీఫ్ వేస్తుంటారు. దర్శకుడి తీత మీద మరీ నమ్మకం ఉంటే ఓ అడుగు ముందుకేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తుంటారు. కొందరైతే సినిమా విడుదల తర్వాత సక్సెస్ చూసి ఆ దర్శకుడి చేతిలో అడ్వాన్స్ పెడుతుంటారు. ఈ విషయంలో గీతా ఆర్ట్స్(Geetha arts) ఓ అడుగు ముందే ఉంటుంది. దర్శకుడిని అంచనా వేయడంలో ఆ సంస్థ ఆరితేరిందనే చెప్పాలి. ఈ మధ్య గీతా సంస్థ ఇద్దరు దర్శకులకు అడ్వాన్స్ ఇచ్చారు. అందులో ఒకరు ‘బింబిసార’(Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్(Vasist), రెండో దర్శకుడు చందు మొండేటి (Chandoo mondeti)అని తెలిసింది.
వశిష్ట్కి అడ్వాన్స్ ఇవ్వడానికి చాలామంది నిర్మాతలే క్యూలో ఉన్నారు. ‘బింబిసార’ సినిమా విడుదలకు ముందే వశిష్ట్ గీతా ఆర్ట్స్లో అడ్వాన్స్ తీసుకున్నారు. ‘బింబిసార 2’ సెట్స్ మీదకెళ్తే ఆ తదుపరి చిత్రం గీతా సంస్థలోనే సినిమా చేయాలి వశిష్ట్. ‘సవ్యసాచి’ తర్వాత చందూ మరో సినిమా చేయడానికి చాలా సమయం పట్టింది. అదంతా ‘సవ్యసాచి’ రిజల్ట్ ఎఫెక్ట్. ఎట్టకేలకు ‘కార్తికేయ–2’ సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో చందూకి మళ్లీ మంచి రోజులొచ్చాయి. ‘కార్తికేయ 2’ చిత్రీకరణ సమయంలోనే గీతా ఆర్ట్స్ చందూ చేతిలో అడ్వాన్స్ పెట్టిందని తెలిసింది. ‘కార్తికేయ 3’ కన్నాముందు చందూ మొండేటి గీతా ఆర్ట్స్లోనే సినిమా చేయాలి. ఈ సారి చందూకి పెద్ద హీరో దొరికే అవకాశముంది.