గంధర్వ ఘన విజయం సాధించాలి
ABN , First Publish Date - 2022-07-07T06:27:50+05:30 IST
‘‘చిరంజీవి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో సందీప్ కళ్లను చూసినప్పుడు అలా అనిపించింది. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్ ఉంది...
‘‘చిరంజీవి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో సందీప్ కళ్లను చూసినప్పుడు అలా అనిపించింది. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్ ఉంది. ‘గంధర్వ’ చిత్రం కథ వినూత్నంగా ఉంది’’ అని నటుడు, నిర్మాత మురళీ మోహన్ అన్నారు. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ఇది. అప్సర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని అబ్దుల్ నిర్మించారు. సురేష్ కొండేటి సమర్పకుడు. వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మురళీ మోహన్ ‘గంధర్వ’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికుమార్ మాట్లాడుతూ ‘కొత్తకథతో మీ ముందుకు వస్తున్నాం. మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. సందీప్ మాధ వ్ మాట్లాడుతూ ‘అప్సర్ చెప్పిన కథ వినగానే నచ్చింది. గాయత్రీ సురేష్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటారు’ అని చెప్పారు. అప్సర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో గాయత్రీ సురేష్ నటన చూస్తే సావిత్రి గుర్తుకొస్తారు. షకీల్ మంచి బాణీలు అందించారు’ అన్నారు. బాబూమోహన్ మాట్లాడుతూ ‘‘గంధర్వ’కు నిర్మాత చాలా కష్టపడ్డారు. కథ, సంగీతం అన్నీ బాగా కుదిరాయి’’ అన్నారు.