డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన 'గాలివాన'
ABN , First Publish Date - 2022-04-14T15:17:03+05:30 IST
‘గాలివాన’ వెబ్ సిరీస్ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయింది. యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందించారు. ఇందులో సీనియర్ స్టార్స్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్
‘గాలివాన’ వెబ్ సిరీస్ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయింది. యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందించారు. ఇందులో సీనియర్ స్టార్స్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర పాత్రల్లో నటించారు. ఇటీవలే అక్కినేని నాగార్జున విడుదల చేసిన ఈ సిరీస్ ట్రైలర్ అద్భుతమైన స్పందనను అందుకుంది. కాగా, ఏప్రిల్ 14 నుంచి 'గాలివాన' జీ5 లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే ఎక్స్క్లూజివ్గా ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ను బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించాయి.