ఏరి కోరి జూనియర్ NTR తో సినిమాలో పాట పాడించుకున్న Puneeth Rajkumar.. పప్పూ ఫ్యాన్స్‌ మెచ్చిన పాట ఇదే..!

ABN , First Publish Date - 2021-10-29T20:48:50+05:30 IST

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం చెందారు. వ్యాయామం చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు కానీ..

ఏరి కోరి జూనియర్ NTR తో సినిమాలో పాట పాడించుకున్న Puneeth Rajkumar.. పప్పూ ఫ్యాన్స్‌ మెచ్చిన పాట ఇదే..!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం చెందారు. వ్యాయామం చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు కానీ.. ఆయన కోలుకోలేకపోయారు. భరించలేని గుండెనొప్పి రావడం వల్ల ఆయన మరణించారని తెలుస్తోంది. ఆయన మరణ వార్తతో కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునేందుకు బెంగళూరుకు తరలివస్తున్నారు. అతి పిన్న వయసులోనే ఇలాంటి ఘోరం జరగడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఆస్పత్రికి వచ్చి నివాళులు అర్పించారు. 


ఇదిలా ఉండగా.. పునీత్ రాజ్ కుమార్ తండ్రి, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్‌‌తో సీనియర్ ఎన్టీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందో.. అదే రీతిలో పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆత్మీయుల్లాగా ఉంటారు. అందుకే పునీత్ రాజ్ కుమార్ కోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు. ఎన్టీఆర్‌ పాట పాడితే ఏ రేంజ్‌లో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఫాలో ఫాలో ఫాలో మీ.. అంటూ నాన్నకు ప్రేమతో సినిమాలో.. ఓలమ్మీ తిక్కరేగిందా అంటూ యమదొంగలో.. రభసలో రాకాసి.. రాకాసి పాటలను ఎన్టీఆర్ పాడారు.


ఎన్టీఆర్ పాటలను ఎంతో ఇష్టపడిన పునీత్ రాజ్ కుమార్ తన సినిమాలో ఓ పాటను పాడాలని స్వయంగా కోరారట. దీంతో ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. చక్రవ్యూహ అనే యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమాలో Geleya Geleya అనే పాటను ఎన్టీఆర్ పాడారు. సినిమాలో ఆ పాట అభిమానులను ఎంతగానో అలరించింది. సినిమా సూపర్ హిట్ అవడంలో ఆ పాట పాత్ర కూడా ఎంతో ఉంది. పునీత్ రాజ్ కుమార్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారని అభిమానులు ఆశించారు కానీ.. ఇంతలోనే ఇలాంటి ఘోరం జరిగిపోయింది. 



Updated Date - 2021-10-29T20:48:50+05:30 IST