జనవరి 30న ముగిసిన ‘బిగ్ బాస్’... రెండు వారాల్లోనే... బిగ్ బాస్ హౌజ్‌లో మంటలు!

ABN , First Publish Date - 2022-02-14T00:22:20+05:30 IST

హిందీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ఎంత పాప్యులరో అందరికీ తెలిసిన సంగతే

జనవరి 30న ముగిసిన ‘బిగ్ బాస్’... రెండు వారాల్లోనే... బిగ్ బాస్ హౌజ్‌లో మంటలు!

హిందీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ఎంత పాప్యులరో అందరికీ తెలిసిన సంగతే. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తాడు. ఈ మధ్యనే ‘బిగ్ బాస్-15’ సీజన్ ముగిసింది. తేజస్వీ ప్రకాష్ విజేతగా నిలిచింది. ముంబైలోని ఫిలింసిటీలో బిగ్‌బాస్ సెట్ ఉంది. తాజాగా ఈ సెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకుని మంటలను అదపు చేయడానికి ప్రయత్నించాయి. అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు.


నాలుగు నెలల పాటు బిగ్‌బాస్-15 ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్యనే జనవరి30న ఆ రియాలిటీ షో ముగిసింది. విన్నర్‌గా నిలిచిన తేజస్వీ దాదాపుగా రూ. 40లక్షలను గెలుచుకుంది. ప్రతీక్ సెజ్‌పాల్ రన్నరప్‌గా నిలిచాడు. ట్రోఫీని గెలుచుకున్న అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడింది. ‘‘ బిగ్‌బాస్‌లోకి  నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు అంత కలలా ఉండేది. నెమ్మదిగా గేమ్‌ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది. ఈ షోలోని అనుభవాలను రియల్ ప్రైజ్‌మనీగా నేను తీసుకు వెళుతున్నాను’’ అని తేజస్వీ చెప్పింది. ప్రస్తుతం ఆమె హిందీ హిట్ సిరీయల్ ‘నాగినీ-6’ లో నటిస్తోంది.



Updated Date - 2022-02-14T00:22:20+05:30 IST