‘కేజీఎఫ్-2’ తో సినీ అభిమానులకు ట్రిపుల్ బొనాంజా

ABN , First Publish Date - 2022-04-10T01:26:43+05:30 IST

స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2’.

‘కేజీఎఫ్-2’ తో  సినీ అభిమానులకు ట్రిపుల్ బొనాంజా

స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ‘చాప్టర్-1’ విజయం సాధించడంతో ‘కేజీఎఫ్-2’ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించారు. ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. ప్రేక్షకులకు కూడా విపరీతమైన ఆసక్తి ఉంది. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ కోసం ఈ చిత్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మూవీతో సినీ అభిమానులకు ట్రిపుల్ బొనాంజా అందబోతున్నట్టు తెలుస్తోంది. 


‘సలార్’ సినిమాలోని ప్రభాస్ ఇంట్రోకు సంబంధించిన టీజర్‌ను ‘కేజీఎఫ్-2’ ప్రింట్‌లకు అటాచ్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘సలార్‌’తో పాటు, ‘భూల్ భులయ్యా-2’ టీజర్, ‘బ్రహ్మాస్త్ర’ మోషన్ పిక్చర్‌‌లు ‘కేజీఎఫ్-2’ ప్రింట్‌లతో లాంచ్ కాబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్: చాప్టర్-2’ను బాలీవుడ్‌లో ‘ఏఏ ఫిలింస్’ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ సంస్థే ‘భూల్ భూలయ్యా-2’ను డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో టీజర్‌ను అటాచ్ చేయాలని నిర్ణయించుకున్నారని కథనాలు వెలువడుతన్నాయి. ఏప్రిల్ 13న ఈ టీజర్‌ను ఆన్‌లైన్‌లోను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్‌తో పాటే ‘బ్రహ్మాస్త్ర’ మోషన్ పోస్టర్ లాంచ్ కానుంది. అలియా భట్ లేదా రణ్‌బీర్ కపూర్‌ల పాత్రలకు సంబంధించిన ప్రోమో విడుదల కాబోతున్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే సినీ అభిమానులకు ట్రిపుల్ బొనాంజా అందబోతోందన్నమాట. 


ఈ ట్రిపుల్ బొనాంజాతో పాటు అజయ్ దేవగణ్ కూడా ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఈ స్టార్ హీరో మల్టీప్లెక్స్‌లతో నేరుగా ఒప్పందం చేసుకున్నాడు. ‘కేజీఎఫ్-2’ను ప్రదర్శించే మల్లీప్లెక్సుల్లో సినిమాకు ముందు ‘రన్ వే-34’ రెండో ట్రైలర్‌ను ప్లే చేస్తారు. ఈ ట్రైలర్ ఏప్రిల్ 11న ఢిల్లీలో విడుదల చేయబోతున్నారు. ‘రన్ వే-34’ లో అజయ్ దేవగణ్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించాడు.

Updated Date - 2022-04-10T01:26:43+05:30 IST