Social media look: అందాల భామల హోయలు!
ABN , First Publish Date - 2022-08-13T03:13:33+05:30 IST
రక్షాబంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ఇద్దరు రాఖీలు కట్టారు. చిరంజీవి వారిద్దని ఆశీర్వదించారు. సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను ఇన్స్ట్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరు. అలాగే రామ్చరణ్, వరుణ్తేజ్కు రాఖీ కడుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చారు నిహారికా కొణిదెల.
రాఖీ పౌర్ణమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చెల్లెళ్లు ఇద్దరూ రాఖీ కట్టి చిరు ఆశీసులు తీసుకున్నారు. మెగా డాటర్ నిహారిక కూడా వరుణ్తేజ్కి రాఖీ కట్టి నమస్కరించింది.
తన లక్కీ ఛాంప్ నయనతారతో బార్సీలోన విహారయాత్రకు వెళ్తున్నారు విఘ్నేశ్ శివన్. (Nayanatara)
శ్రుతీహాసన్, రాశీఖన్నా, తమన్నా, హెబా పటేల్ స్టైలిష్ దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు. (shruthi hassan)
రాయ్లక్ష్మీ ఎర్రటి దుస్తులు కనువిందు చేశారు. (Railakshmi)