దీపికా పదుకొణె పోస్ట్కు రణ్వీర్ సింగ్ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు ఇవీ..!
ABN , First Publish Date - 2022-04-27T19:51:55+05:30 IST
బాలీవుడ్లోని క్రేజీ హీరోయిన్స్లో దీపికా పదుకొనే ఒకరు. కన్నడ సినిమా ‘ఐశ్వర్య’తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార..
బాలీవుడ్లోని క్రేజీ హీరోయిన్స్లో దీపికా పదుకొణె ఒకరు. కన్నడ సినిమా ‘ఐశ్వర్య’తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార అనంతరం ‘ఓం శాంతి ఓం’తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రతి సినిమాకి తన క్రేజ్ని పెంచుకుంటూ వెళ్లింది. అంతేకాకుండా హాలీవుడ్లోకి సైతం అడుగుపెట్టింది. తాజాగా ఈ భామ మరో ఘనత సాధించింది. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కి జ్యూరీ మెంబర్గా ఎంపికైంది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్లో.. కేన్స్ అధికారిక పోస్టర్ని దీపిక షేర్ చేసింది. అందులో దీపికతోపాటు ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్, నటి రెబెక్కా హాల్, స్వీడన్కు చెందిన నూమి రాపేస్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకాతో పాటు అస్గర్ ఫర్హాదీ, లాడ్జ్ లీ, జెఫ్ నికోల్స్, జోచిమ్ ట్రైయర్ వంటి దర్శకులు ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఉన్న ఈ జ్యూరీకి విన్సెంట్ ప్రెసిండెంట్గా ఉంటాడు. దీపిక ఈ పోస్ట్కి దండం పెడుతున్న ఎమోజీని జత చేసింది. దీనిపై ఆమె భర్త, నటుడు రణ్వీర్ సింగ్ స్పందిస్తూ ‘వావ్’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘ఓ మై గాడ్. దిపికా పదుకొనే కేన్స్ జ్యూరీ మెంబర్స్లో ఉంది. చాలా ఆనందం అనిపించింది. ఈ దేశ అమ్మాయిగా గర్వపడుతున్నా’ అంటూ ఓ లేడి ఫ్యాన్ ట్వీట్ చేసింది. ‘ఓ మహిళ మాట్లాడకుండా పనిచేసుకుంటూ వెళితే గుర్తింపు అదే వస్తుందని నిరూపించారు. ఎంతో గర్వంగా ఉంది’ అంటూ మరో ఫ్యాన్ పోస్ట్ చేసింది. ‘బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే కేన్స్ జ్యూరీ మెంబర్స్లో ఒకరిగా ఉంది’ అంటూ మరొక ఫ్యాన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ కామెంట్పై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ ‘దీపిక ప్రతి అచీవ్మెంట్ని రణ్వీర్ సేలబ్రేట్ చేయడం నాకు చాలా నచ్చింది’ అంటూ రాసుకొచ్చారు.