Ponniyin Selvan: ‘బాహుబలి’ తో పోల్చుతూ ఫ్యాన్స్ ట్రోలింగ్

ABN , First Publish Date - 2022-10-02T01:57:46+05:30 IST

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan).

Ponniyin Selvan: ‘బాహుబలి’ తో పోల్చుతూ ఫ్యాన్స్ ట్రోలింగ్

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, జయం రవి  తదితరులు కీలక పాత్రలు పోషించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల 'పొన్నియిన్ సెల్వన్‌'ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అయింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. దీంతో కొన్ని వెబ్‌సైట్స్ నెగెటివ్ రివ్యూస్ ఇచ్చాయి. కొంత మంది ఫ్యాన్స్ సినిమాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ‘బాహుబలి’ (Baahubali) తో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.  


‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 217కోట్ల వసూళ్లను సాధించగా, ‘పొన్నియిన్ సెల్వన్’ మాత్రం మొదటి రోజు రూ. 75కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే కొల్లగొట్టిందని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. అందువల్ల ‘బాహుబలి-2’ తో పొన్నియన్ సెల్వన్‌ను ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దని కోరాడు. విజువల్ ఎఫెక్ట్స్, వార్ సీన్స్ ఆశించిన స్థాయిలో లేవని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ ను చూసిన తర్వాతే రాజమౌళి విలువ తెలిసిందని ఓ సోషల్ మీడియా యూజర్ చెప్పాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ కు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తుంది. వరల్డ్ వైడ్‌గా రూ.85కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా.. ‘పొన్నియిన్ సెల్వన్-2’ షూటింగ్ గతంలోనే పూర్తయింది. ఆరు నెలల నుంచి తొమ్మిది కాలంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తామని మణిరత్నం పేర్కొన్నాడు. 



Updated Date - 2022-10-02T01:57:46+05:30 IST