బన్నీ సినిమా బాలీవుడ్ రీమేక్... పక్కకు తప్పుకున్న బడా నిర్మాత

ABN , First Publish Date - 2021-10-10T00:38:54+05:30 IST

‘అల వైకుంఠపురములో’... బన్నీ, పూజా హెగ్డే స్టారర్ త్రివిక్రమ్ మూవీ... ఎంత పెధ్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో మనకు తెలిసిందే. అయితే, ‘అల‘ మూవీ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతోంది.

బన్నీ సినిమా బాలీవుడ్ రీమేక్... పక్కకు తప్పుకున్న బడా నిర్మాత

‘అల వైకుంఠపురములో’... బన్నీ, పూజా హెగ్డే స్టారర్ త్రివిక్రమ్ మూవీ... ఎంత పెధ్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో మనకు తెలిసిందే. అయితే, ‘అల‘ మూవీ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతోంది. అక్టోబర్ 12 నుంచీ రెగ్యులర్ షూటింగ్ కూడా. అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ కనిపించబోతున్నాడు. హీరోయిన్‌గా క‌ృతీ సనన్ ఎంపికైంది. అయితే, ‘షెహజాదా’ టైటిల్‌తో జనం ముందుకు రానున్న హిందీ రీమేక్ ఏక్తా కపూర్ నిర్మిస్తారని ప్రచారం జరిగింది. కానీ, సినిమా ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆమె ప్రాజెక్ట్ నుంచీ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది...


ఏక్తా కపూర్ బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్. ఆమె తీసే సినిమాలంటే జనాలకి ఆసక్తి ఏర్పడటం సహజం. అయితే, మొదట్నుంచీ ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ఏక్తా మూవీగా ప్రచారమైంది. కానీ, ఇప్పుడు కాంట్రక్ట్ పరంగా వచ్చిన కొన్ని చిక్కుల వల్ల ఆమె తప్పుకుందట. ఆ కారణాలేంటో ప్రత్యేకంగా బయటకు చెప్పనప్పటికీ ఇప్పుడు ‘షహజాదా’ సినిమాని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మంచనున్నారు. 


తెలుగులో ‘అల వైకుంఠపురములో’ నిర్మించిన మన అల్లు అరవిందే బాలీవుడ్ వర్షన్ కూడా రీమేక్ చేస్తుండటం ఆసక్తికరమైన పరిణామమే. బన్నీ బ్లాక్ బస్టర్ బాలీవుడ్‌లో ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ సాధిస్తుందో చూడాలి...   

Updated Date - 2021-10-10T00:38:54+05:30 IST