ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కి ఈడీ సమన్లు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-20T17:12:20+05:30 IST

పనామా పేపర్స్ లీకేజీ.. 2016లో సంచలనం సృష్టించిన విషయాల్లో ఇదొకటి. ఇందులో భాగంగా దాదాపు 11.5 మిలియన్ల రహస్య డాక్యుమెంట్లు లీకైయ్యాయి...

ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కి ఈడీ సమన్లు.. కారణం ఏంటంటే..

పనామా పేపర్స్ లీకేజీ.. 2016లో సంచలనం సృష్టించిన విషయాల్లో ఇదొకటి. ఇందులో భాగంగా దాదాపు 11.5 మిలియన్ల రహస్య డాక్యుమెంట్లు లీకైయ్యాయి. దీంతో 2,14,488 కంపెనీల బండారం బయటపడింది. అప్పట్లో ఎంతోమంది ప్రముఖులను ఈ కేసుకి సంబంధించి మనీలాండరింగ్ విషయాల గురించి ప్రశ్నించింది ఈడీ. 


తాజాగా ఈడీ అధికారులు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కి సమన్లు జారీ చేశారు. ఈ సంస్థ ఆఫీసుకి వచ్చి ఆమె స్టేట్‌మెంట్‌ని ఇవ్వమని చెప్పారు. నివేదికల ప్రకారం, దీని గురించి మరో తేదిన ప్రశ్నించాలని ఐష్ కోరినట్లు సమాచారం. కాగా మనీ లాండరింగ్ నివారణ చట్టం 2002 కింద ఈ భామపై ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.



Updated Date - 2021-12-20T17:12:20+05:30 IST