జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు షాకిచ్చిన ఈడీ
ABN , First Publish Date - 2022-04-30T20:39:09+05:30 IST
ఆర్థిక మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటుంది.
ఆర్థిక మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ఎదుర్కొంటుంది. తాజాగా జాక్వెలిన్కు చెందిన రూ.7.27కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల్లో ఆమె పేరు మీద ఉన్న రూ.7.12కోట్ల విలువజేసే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది.
సుకేశ్ చంద్రశేఖర్ రూ.5.71కోట్ల విలువైన గిఫ్ట్లను జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఇచ్చాడని ఈడీకి సాక్ష్యాధారాలు లభించాయి. ఆమెకు ఖరీదైన బాహుమతులు మాత్రమే కాకుండా నగదును కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 1,73,000 అమెరికన్ డాలర్లు, 27,000ఆస్ట్రేలియన్ డాలర్లను ఆమె కుటుంబ సభ్యులకు గిఫ్ట్గా ఇచ్చాడని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఆర్థిక మోసం కేసులో జాక్వెలిన్కు ఇప్పటి వరకు క్లీన్ చిట్ లభించలేదు. దేశం విడిచి వెళ్లకుండా ఆమెపై నిషేధం ఉంది.