ఖైదీ సీక్వెల్, విక్రమ్ సీక్వెల్.. ఏ సినిమాను ముందుగా Lokesh Kanagaraj థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడంటే..
ABN , First Publish Date - 2022-06-08T23:13:54+05:30 IST
‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం (Vikram). కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించారు
‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం (Vikram). కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశారు. పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో ఈ మూవీ విడుదల అయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఖైదీ సీక్వెల్, విక్రమ్ సీక్వెల్ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ క్రైమ్ సినీమాటిక్ యూనివర్స్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట. అందువల్లే ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్లో పార్ట్-2 ఉందని చెప్పారు. ‘విక్రమ్’ సీక్వెల్ను లింక్ చేస్తూ ‘ఖైదీ’ సీక్వెల్ను తెరకెక్కించాలనే ఆలోచనలో లోకేశ్ ఉన్నారు. అందువల్లే ‘విక్రమ్’ సీక్వెల్ ముందుగా థియేటర్స్లోకి వస్తుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘ఖైదీ’ నిర్మాత ఎస్ఆర్. ప్రభు సోషల్ మీడియాలో ‘ఖైదీ’ సీక్వెల్ హింట్ ఇస్తూ ఇప్పటికే నెటిజన్స్ను టీజ్ చేశారు. ‘విక్రమ్’ సినిమాకు ‘మేజర్’ (Major), ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj) నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ భారీ వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 200కోట్ల కలెక్షన్స్ను కొల్లగొట్టింది. కేరళలో ఆల్టైం నం-1 తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.