Kartik Aaryan నుంచి Tabu వరకు.. Bhool Bhulaiyaa 2 సినిమాలోని నటులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..
ABN , First Publish Date - 2022-06-27T20:49:46+05:30 IST
బాలీవుడ్లో స్వ శక్తితో ఎదిగిన నటుల్లో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. తాజాగా ‘భూల్ భూలయ్యా-2’(Bhool Bhulaiyaa 2)లో నటించారు. హారర్ కామెడీగా ఈ చిత్రం రూపొందింది. కియారా
బాలీవుడ్లో స్వ శక్తితో ఎదిగిన నటుల్లో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. తాజాగా ‘భూల్ భూలయ్యా-2’(Bhool Bhulaiyaa 2)లో నటించారు. హారర్ కామెడీగా ఈ చిత్రం రూపొందింది. కియారా అడ్వాణీ (Kiara Advani)హీరోయిన్గా నటించారు. ‘టీ- సిరీస్’ నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో ఏప్రిల్ 20న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఐదువారాల్లో రూ. 180కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో నటించడానికి కార్తిక్, కియారా భారీ పారితోషికాలను అందుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
కార్తిక్ ఆర్యన్ ‘భూల్ భూలయ్యా-2’ లో రూహ్ బాబా పాత్రలో కనిపించారు. చిత్రాన్ని మొత్తం తన భుజాల పైనే నడిపించారు. ఈ సినిమాలో నటించేందుకు ఆయన రూ. 15కోట్లను పారితోషికంగా తీసుకున్నారని బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కియారా అడ్వాణీ ఈ సినిమాలో రీత్ ఠాకూర్ పాత్రను పోషించారు. అందుకు గాను రూ. 4కోట్లను రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ‘భూల్ భూలయ్యా-2’ లో టబు, రాజ్ పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టబు ఈ సినిమాలో నటించేందుకు రూ. 2కోట్లను పారితోషికంగా అందుకున్నారట. సంజయ్ మిశ్రా కూడా రూ.1.25కోట్లను తీసుకున్నారని తెలుస్తోంది. ‘భూల్ భూలయ్యా-2’ హిట్ కావడంతో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్ను గిఫ్ట్తో సర్ప్రైజ్ చేశారు. విలాసవంతమైన కారు ‘మెక్ లారెన్-జీటీ’ ని బాహుమతిగా ఇచ్చారు. దీంతో కార్తిక్ ఉబ్బితబ్బిబయ్యారు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు వచ్చే సారి ప్రైవేట్ జెట్ను గిఫ్ట్గా ఇవ్వాలని నిర్మాతను కోరారు.