స్పేస్ లేనిచోట ఎలా క్రియేట్ చేయాలో.. ఆయన ద్వారా తెలుసుకున్నా: హీరో సిద్ధు

ABN , First Publish Date - 2022-02-03T02:40:05+05:30 IST

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం

స్పేస్ లేనిచోట ఎలా క్రియేట్ చేయాలో.. ఆయన ద్వారా తెలుసుకున్నా: హీరో సిద్ధు

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిన్న సినిమాలు వస్తాయి. మధ్యలో పెద్ద సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా ఉంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ఆ సినిమా విడుదల చేస్తాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ‘డిజె టిల్లు’ యూత్ సినిమా. ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నాం. నాకు బాగా నచ్చిన కథ డిజె టిల్లు. కథ నచ్చడంతో కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం..’’ అని తెలుపగా, దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ లాక్‌డౌన్‌లో నేను, సిద్ధు కథ మీద కూర్చున్నప్పుడు... సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాల్ని నవ్వించాలనే మోటివ్‌తో ఉన్నాం. టీజర్ చూశారు. ఇప్పుడు ట్రైలర్ చూశారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు..’’ అని అన్నారు.


హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. విమల్ కృష్ణ, నేను డిస్కస్ చేసుకుని కథ, స్క్రీన్‌ప్లే రాశాం. డైలాగ్స్ నేను రాశా. థియేటర్‌లో మీరు బాగా నవ్వుకుంటారు. నేను జీవితంలో చూసిన సందర్భాలు, మనుషులు, నా స్వభావాలు కొన్ని కలిపి ఈ క్యారెక్టర్ రాసుకున్నాము. త్రివిక్రమ్‌గారు స్క్రిప్ట్ విషయంలో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. నిర్మాత వంశి మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. డైలాగులతో కథను ముందుకు తీసుకువెళ్లే సినిమాలు నాకు ఇష్టం. స్పేస్ లేనిచోట ఎలా క్రియేట్ చేయాలో త్రివిక్రమ్‌గారిని చూసి తెలుసుకున్నాను. ఆయనతో టైమ్ స్పెండ్ చేస్తే ఏమైనా చేయవచ్చనే ఫీలింగ్ వస్తుంది. నిర్మాత వంశీ ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. కావాలంటే సీన్లు మళ్ళీ తీయమని చెప్పారు. నేను నెక్స్ట్ సినిమా కూడా ఈ బ్యానర్‌లోనే చేస్తున్నాను. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. నాకు సితార హోమ్ బ్యానర్ లాంటిది. 100 పర్సెంట్ కొడుతున్నాం. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా అమ్మాయి గురించే. ఆమె జీవితంలోకి డిజె టిల్లు లాంటి క్యారెక్టర్ వస్తే ఏం జరిగిందనేది సినిమా. యూత్‌కు రిలేట్ అయ్యేలా సినిమా ఉంటుంది..’’ అన్నారు. ‘నేను కథ విన్నప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశానో.. సినిమా చూస్తున్నప్పుడు మీరూ అంతే ఆస్వాదిస్తారు’’ అని తెలిపారు హీరోయిన్ నేహా శెట్టి.


ట్రైలర్ విషయానికి వస్తే.. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంది. అందమైన అమ్మాయి రాధికను సొంతం చేసుకునేందుకు డిజె టిల్లు చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అల్లు అర్జున్ కొత్త సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నానంటూ అతను చెప్పుకునే గొప్పలు, చేసే అల్లరి పనులు ఆకట్టుకున్నాయి. నేను నిన్ను హోల్ హార్టెడ్‌గా లవ్ చేసిన, తెలిసే నన్ను హౌలాగాడిని చేస్తున్నావ్ సో స్వీట్ ఆఫ్ యూ రాధికా వంటి డైలాగ్స్ పేలాయి. రాధిక తనొక్కరికే సొంతం కాదని తెలిసినప్పుడు డిజె టిల్లు అసహనం నవ్విస్తుంది. రాధిక టిల్లుకే దక్కిందా?, ఇంకెవరి ప్రేమనైనా అంగీకరించిందా? అనే ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ఉంది.

Updated Date - 2022-02-03T02:40:05+05:30 IST