మాజీ భార్యపై పరువు నష్టం దావా కేసు గెలిచిన Johnny Depp.. నటుడికి క్షమాపణ కోరుతూ రూ.2535 కోట్ల ఆఫర్..

ABN , First Publish Date - 2022-06-27T16:52:50+05:30 IST

‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’.. సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జానీ డెప్. ఈ నటుడు 2018లో..

మాజీ భార్యపై పరువు నష్టం దావా కేసు గెలిచిన Johnny Depp.. నటుడికి క్షమాపణ కోరుతూ రూ.2535 కోట్ల ఆఫర్..

‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’.. సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జానీ డెప్. ఈ నటుడు 2018లో ఆయన మాజీ భార్య అంబర్ హెర్డ్ చేసిన కామెంట్స్‌పై పరువునష్టం దావా వేశాడు. దాదాపు ఆరు వారాల పాటు విచారణ జరిగిన కేసును చివరికీ ఈ నటుడే గెలుచుకున్నాడు. దీంతో పాటు ఆయనకి 50 మిలియన్ల డాలర్లను పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. అప్పట్లో విడాకుల కేసు సందర్భంగా ఈ డెప్‌ తనపై గృహ హింసకి పాల్పడ్డాడని అంబర్ ఆరోపణలు చేయడం, ఆయన కెరీర్‌పై చాలా ప్రభావాన్ని చూపింది. ఆ సమయంలో ఫెంటాస్టిక్ బీస్ట్ 3, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ వంటి సినిమాల నిర్మాణ సంస్థలు ఆయనతో మూవీ చేయడానికి నిరాకరించాయి.


అయితే.. తాజాగా పరువునష్టం దావా కేసు గెలవడంతో డెప్ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే పనిలో పడిపోయాడు. ఈ తరుణంలో డిస్నీ సంస్థ డెప్‌ని పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీలో జాక్ స్పారోగా నటించడానికి రూ. 2535 కోట్ల ఆఫర్‌తోపాటు క్షమాపణ కోరుతూ ఓ లేఖని పంపిందని తెలుస్తోంది. ఎంతో పాపులర్ అయిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ మొత్తం ఐదు భాగాలలో ఈ స్టార్ జాక్ స్పారోగా నటించాడు. కాగా.. ఈ న్యూస్ గురించి డెప్ వైపు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. డిస్నీ క్షమాపణలను ఈ నటుడు అంగీకరించాడో ఇంకా తెలియలేదు. అయితే.. డిస్నీ సంస్థ ఆఫర్ చేసిన మనీ పరువు నష్టం దావాలో డెప్ కోట్ చేసిన మొత్తానికి దగ్గరగా ఉండడం విశేషం. కానీ.. ఎంత మనీ ఇచ్చిన జాక్ స్పారోగా నటించడానికి ఈ హాలీవుడ్ స్టార్ ఇంట్రస్ట్‌గా లేడని తెలుస్తోంది.

Updated Date - 2022-06-27T16:52:50+05:30 IST