Teja and Abhiram: పోలవరంలో.. పొలిటికల్ సినిమా కాదు!
ABN , First Publish Date - 2022-09-01T00:02:10+05:30 IST
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) రెండో తనయుడు అభిరామ్ దగ్గుబాటి (Abhiram Daggubati).. హీరోగా అరంగేట్రం సంగతి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ దర్శకుడు..
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) రెండో తనయుడు అభిరామ్ దగ్గుబాటి (Abhiram Daggubati).. హీరోగా అరంగేట్రం సంగతి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ దర్శకుడు తేజ (Teja) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పోలవరం (Polavaram) వద్ద జరుగుతోంది. పోలవరం అనగానే, ఇదేదో రాజకీయ నేపధ్యం వున్న కథ అని అనుకోకండి, ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని తేజ అంటున్నారు. ఈ వారమంతా అక్కడ షూటింగ్ చేస్తే సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందని తెలిపారు తేజ. తెలుగు చిత్ర సీమలో ఎక్కువ మంది నటుల్ని, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత దర్శకుడు తేజాకే ఉంది. ఆయన పరిచయం చేసిన వారెందరో ఈరోజు స్టార్స్గా చలామణీ అవుతున్నారు.
ఇప్పుడు చేస్తున్న చిత్రంతో కూడా దాదాపు 22 మంది కొత్త నటులను తేజ పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాతో అభిరామ్ దగ్గుబాటి కూడా పరిచయమవటం విశేషం. ఈ సినిమాని సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ ఈ ఆదివారం అయిపోగానే.. మరోవైపు సమాంతరంగా జరుగుతున్న టెక్నికల్ వర్క్ కూడా త్వరత్వరగా పూర్తి చేసేస్తామని అంటున్నారు. అందుకే సెప్టెంబర్ 30కి విడుదల తేదీ ఖరారు చేసుకున్నట్టు చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటీ అంటే.. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), కింగ్ నాగార్జున (King Nagarjuna) సినిమాలు కూడా విడుదలవుతుండటం. ఇందులో కథానాయికగా ముంబైకి చెందిన కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నట్టుగా తేజ చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.