Salaar: దర్శకుడి కఠిన నిర్ణయం!
ABN , First Publish Date - 2022-09-27T01:08:33+05:30 IST
‘సలార్’ చిత్ర దర్శకుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘సలార్’కు సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
‘సలార్’ (Salaar)చిత్ర దర్శకుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘సలార్’కు సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఫొటోలు ఒకటి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం దర్శకుడి దృష్టికి వెళ్లడంతో ప్రశాంత్ నీల్ లీక్పై మండిపడ్డారని తెలిసింది. సినిమాకు కీలకమైన సన్నివేశాలు, ఎంతో కష్టపడి చిత్రీకరిస్తుంటే ఇలా ఆన్లైన్లో లీక్ అవ్వడం పట్ల యూనిట్కి క్లాస్ తీసుకున్నారట ప్రశాంత్ నీల్(Prashanth neel). అంతే కాదు మరో కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారని అంటున్నారు. సెట్లో అడుగుపెట్టే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫోన్ తీసుకురావద్దని ఆదేశించారట. యూనిట్ సభ్యులంతా కారావ్యాన్ లేదా లాకర్స్లో పెట్టుకుని రావాల్సిందిగా సూచించారట. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ సినిమాను విడుదల చేేసందుకు సన్నాహాలు చేస్తున్నారు.