‘ప్రేమదేశం’ సీక్వెల్ తీస్తానంటోన్న దర్శకుడు కదిర్

ABN , First Publish Date - 2021-09-19T22:27:16+05:30 IST

‘ముస్తఫా.. ముస్తఫా డోండ్ వర్రీ ముస్తఫా’ అంటూ.. నైంటీస్ లో యువతను ఓ ఊపు ఊపేసిన ఈ పాట .. ‘ప్రేమదేశం’ సినిమాలోదని అప్పటివారెవరైనా ఇట్టే చెప్పేస్తారు.

‘ప్రేమదేశం’ సీక్వెల్ తీస్తానంటోన్న దర్శకుడు కదిర్

‘ముస్తఫా.. ముస్తఫా డోండ్ వర్రీ ముస్తఫా’ అంటూ.. నైంటీస్ లో యువతను ఓ ఊపు ఊపేసిన ఈ పాట .. ‘ప్రేమదేశం’ సినిమాలోదని అప్పటివారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. స్నేహాన్ని, ప్రేమని ముడిపెడుతూ.. చాలా ఎమోషనల్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు కదిర్. ‘కాదల్ దేశం’ గా తమిళనాట విడుదలైనా.. దీనికన్నా తెలుగు వెర్షనే అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. అబ్బాస్, వినీత్, టబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి ఏ.ఆర్.రహమాన్ సంగీతం హైలైట్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వింటూంటే.. మన మనసు ఎటో వెళ్ళిపోతుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు కదిర్. 


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..  ‘ప్రేమదేశం’ సినిమాకి సీక్వెల్ తీయమని చాలా మంది అడుగుతున్నారు. దాంతో ఆ దిశగా నేను కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఈ సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే పెద్ద హిట్టైంది. అందుకే తెలుగులోనే సీక్వెల్ తీసి.. తమిళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. కొత్త నటీనటులతో సీక్వెల్ ప్లాన్ చేశాను. టాలెంటున్న కొత్త నటీనటులతో పాటు నిర్మాతను కూడా వెతికే పనిలో ఉన్నాను. అంతా అనుకున్నట్టే జరిగితే.. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ  సినిమాకి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది’ అని చెప్పారు. మరి ఈ సీక్వెల్ లో నటించే ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి. 

Updated Date - 2021-09-19T22:27:16+05:30 IST