Jigarthanda 2: క్రేజీ హిట్ మూవీకి సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-08-01T21:00:43+05:30 IST

కోలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా ‘జిగర్తాండ’ (Jigarthanda). యాక్షన్ కామెడీగా రూపొందింది. కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2014లో ఆగస్టు 1న విడుదలైంది.

Jigarthanda 2: క్రేజీ హిట్ మూవీకి సీక్వెల్ ప్రకటించిన దర్శకుడు

కోలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా ‘జిగర్తాండ’ (Jigarthanda). యాక్షన్ కామెడీగా రూపొందింది. కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2014లో ఆగస్టు 1న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ విడుదలై ఎనిమిదేళ్లు కావడంతో ‘జిగర్తాండ’ కు సీక్వెల్ రూపొందించనున్నట్టు కార్తిక్ సుబ్బరాజ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘8ఇయర్స్ ఆఫ్ జిగర్తాండ’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతుందని కార్తిక్ సుబ్బరాజ్ తెలిపాడు.  


‘జిగర్తాండ’ లో సిద్దార్థ్ (Siddharth), బాబీ సింహా (Bobby Simha), లక్ష్మీ మీనన్, కరుణాకరన్, గురు సోమసుందరం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరిశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించాడు. ‘జిగర్తాండ’ కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ సహాయ నటుడిగా బాబీ సింహా, ఎడిటింగ్‌కు వివేక్ హర్షన్ నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. ‘జిగర్తాండ’ కథ విషయానికి వస్తే.. ఓ అప్‌కమింగ్ డైరెక్టర్ క్రూరమైన గ్యాంగ్ స్టర్ సినిమాను నిర్మించాలనుకుంటాడు. అందు కోసం రియల్ లైఫ్‌లో నేరగాళ్ల జీవితాన్ని అధ్యయనం చేయాలనుకుంటాడు. అందుకోసం సేతు అనే నేరగాణ్ని కలుస్తాడు. కానీ, అనుకోని కారణాల వల్ల గ్యాంగ్ స్టర్ చేతిలో హీరో ఇరుక్కుంటాడు. హీరో, సేతుల మధ్య జరిగే కథే జిగర్తాండ. ‘జిగర్తాండ’ ను తెలుగులో ‘గద్దల కొండ గణేష్’ పేరుతో రీమేక్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్స్‌గా నటించారు. తెలుగులోను ఈ సినిమా బంపర్ హిట్ అయింది. బాలీవుడ్‌లో ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ చేయగా దారుణంగా పరాజయం పాలైంది.



Updated Date - 2022-08-01T21:00:43+05:30 IST