అనసూయతో చిత్రం చేస్తున్న దర్శకుడికి బంపరాఫర్
ABN , First Publish Date - 2022-03-14T02:09:55+05:30 IST
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్తో ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైవిధ్యభరితమైన కాన్సెఫ్ట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి..
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్తో ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైవిధ్యభరితమైన కాన్సెఫ్ట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా తర్వాత మళ్లీ జయశంకర్తోనే మరో చిత్రం చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిన్నారు. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఏప్రిల్ లోపు పూర్తి చేయనున్నాం. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రకు సంబంధించిన సీన్స్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాచారు. థియేటర్స్లో ఆ సీన్స్ తప్పకుండా నవ్వులు పూయిస్తాయి. జయశంకర్ వర్కింగ్ స్టైల్ చాలా బాగుంది.. అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆ వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం..’’ అని తెలిపగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతల ప్రోత్సాహంతో చిత్రీకరణ బాగా జరుగుతుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్గారి సంగీతం చాలా ప్లస్ అవుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. చిత్ర టైటిల్తో పాటు విడుదల తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తాం..’’ అని తెలిపారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్’ అనే టైటిల్ను అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.