Hanu Raghavapudi : మైత్రీ నుంచి అడ్వాన్స్ అందుకున్నాడా?

ABN , First Publish Date - 2022-08-09T15:48:14+05:30 IST

‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) చిత్రం నుంచి టాలీవుడ్‌లో దర్శకుడిగా జెర్నీ ప్రారంభించాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). దర్శకుడిగా మంచి మార్కులేయించుకున్నప్పటికీ.. సినిమా కమర్షియల్‌గా నిలబడలేకపోయింది.

Hanu Raghavapudi : మైత్రీ నుంచి అడ్వాన్స్ అందుకున్నాడా?

‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) చిత్రం నుంచి టాలీవుడ్‌లో దర్శకుడిగా జెర్నీ ప్రారంభించాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). దర్శకుడిగా మంచి మార్కులేయించుకున్నప్పటికీ.. సినిమా కమర్షియల్‌గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత  నానీ (Nani) ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడిలేచె మనసు’ సినిమాలు సైతం అవే రిజల్ట్‌ను రాబట్టడంతో హను టాలీవుడ్‌లో తనను తాను నిరూపించుకోవల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే హను ఆ ప్రయత్నంలో ఇప్పుడు సూపర్ సక్సెస్ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా హను తెరకెక్కించిన ‘సీతారామం’ (Sitaramam) చిత్రం ఎపిక్ లవ్ స్టోరీగా అందరి మన్ననలు పొందుతోంది. తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని.. నిలకడైన వసూళ్ళను సాధిస్తోంది. దాంతో హను రాఘవపూడికి బడా సంస్థల నుంచి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నుంచి హను రాఘవపూడికి అవకాశం వచ్చింది. దానికి అడ్వాన్స్ కూడా అందుకున్నట్టు సమాచారం. 


అతడి తదుపరి సినిమా మైత్రీలోనే. అలాగే.. హనుకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇంతకు ముందే బాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అయితే దాని కన్నా ముందే మైత్రీ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు. ఒక స్టార్ హీరోతో సినిమా తెరకెక్కనున్నట్టు వినికిడి. హను దగ్గర రెండు కథలు రెడీగా ఉన్నాయి. హీరో సెట్ అయితే.. సినిమాను పట్టాలెక్కించడం ఏ మాత్రం ఆలస్యం కాకపోవచ్చు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు తెలుస్తాయి . లోకల్ హీరోలతో కాకుండా..  దుల్ఖర్ సల్మాన్ లాంటి పరభాషా హీరోతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి.. తదుపరి చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతాడా లేక మన హీరోతోనే సినిమా చేస్తాడా అనేది చూడాలి.   

Updated Date - 2022-08-09T15:48:14+05:30 IST