బిగ్బాస్ ఫేమ్స్ సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో ‘ఏటీఎమ్’.. ప్రారంభం
ABN , First Publish Date - 2022-04-26T00:21:22+05:30 IST
సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘ఏటీఎమ్’. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి
సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘ఏటీఎమ్’. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్బాస్ ఫేమ్స్ వీజే సన్నీ (విన్నర్), దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలను గ్రాండ్గా నిర్వహించారు.
ఇంతకుముందు ఈ సిరీస్ను దిల్ రాజు, హరీష్ శంకర్ గ్రాండ్గా ప్రకటించిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కాల్కి కూడా వారు పిలుపునిచ్చారు. ఈ క్యాస్టింగ్ కాల్ ప్రకటనకు మంచి స్పందన వచ్చినట్లుగా కూడా మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన షూటింగ్ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. థ్రిల్లర్ కథతో ఈ ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతం, పీజీ విందా సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.