చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే క్లారిటీ ఇస్తాం: దిల్ రాజు, అనిల్

ABN , First Publish Date - 2022-06-24T21:51:49+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్‌తో శుక్రవారం చర్చలు జరిపామని, ఇంకొన్ని చర్చల అనంతరం.. జీతాల పెంపుపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేస్తామని తెలిపారు నిర్మాత దిల్ రాజు

చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే క్లారిటీ ఇస్తాం: దిల్ రాజు, అనిల్

Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్‌తో శుక్రవారం చర్చలు జరిపామని, ఇంకొన్ని చర్చల అనంతరం.. జీతాల పెంపుపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేస్తామని తెలిపారు నిర్మాత దిల్ రాజు. అంతకుముందు వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో గురువారం సినీ కార్మికులు సమ్మె విరమించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తూ.. దిల్ రాజు అధ్యక్షతన ఓ సమన్వయ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఆ సమన్వయ కమిటీ పెద్దలు.. శుక్రవారం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపారు. 


చర్చలు అనంతరం ‘‘ఫెడరేషన్, నిర్మాతలు పాల్గొన్న ఈ సమావేశంలో కార్మికుల వేతన పెంపు విషయంపై చర్చలు జరిగాయి. ఈ రోజు నుండి సినిమా షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. పెరిగిన వేతనాలు ఈ రోజు నుండి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుంటాము. మరి కొన్ని చర్చల అనంతరం..  మీడియాకు అన్ని వివరాలను తెలియజేస్తాం. ’’ అని నిర్మాత దిల్ రాజు, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-06-24T21:51:49+05:30 IST