కథ నచ్చేసిందా?
ABN , First Publish Date - 2022-05-24T06:09:18+05:30 IST
యువ హీరోలు స్పీడుగా ఉన్నారు. ఓ సినిమా చేస్తుండగానే, రెండు మూడు కథలు ఓకే చేసి, లైన్లో పెట్టుకొంటున్నారు...
యువ హీరోలు స్పీడుగా ఉన్నారు. ఓ సినిమా చేస్తుండగానే, రెండు మూడు కథలు ఓకే చేసి, లైన్లో పెట్టుకొంటున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా అదే చేస్తున్నారు. అఖిల్ కథానాయకుడిగా ‘ఏజెంట్’ రూపుదిద్దుకొంటోంది. ‘ఏజెంట్’ సెట్స్పై ఉండగానే, మరో కథకు అఖిల్ పచ్చజెండా ఊపారని టాలీవుడ్ టాక్. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఇటీవల అఖిల్కు ఓ కథ చెప్పారని, అది బాగా నచ్చేసిందని, వెంటనే ఈ సినిమా చేయడానికి అఖిల్ అంగీకరించారని తెలుస్తోంది. మోహన్ రాజా ప్రస్తుతం చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అది అవ్వగానే అఖిల్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెడతారని టాక్. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్’ షూటింగ్ ప్రస్తుతం మనాలీలో జరుగుతోంది. మమ్ముట్టి కీలక పాత్రధారి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.