Samantha: అందుకే సోషల్ మీడియాకు దూరంగా సామ్
ABN , First Publish Date - 2022-08-29T22:01:01+05:30 IST
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత వరుసగా సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత వరుసగా సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది. పలు కథలను వింటుంది. సోషల్ మీడియాలో సామ్ చాలా చురుకుగా ఉంటుంది. తన మీద వచ్చే ట్రోల్స్కు చాలా గట్టిగా బదులిస్తుంది. కానీ, సమంత గత కొంతకాలంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్లు షేర్ చేయడం లేదు. దీంతో అనేక వదంతులు హల్చల్ చేయడం ప్రారంభించాయి.
పెళ్లి నాటి జ్ఞాపకాలను సామ్ మరచిపోలేకపోతుందని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని పలు కథనాలు వెలువడ్డాయి. కానీ, అవేవీ నిజం కాదట. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ (Citadel) లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సిటాడెల్’ లో అనేక యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అందువల్ల తన పాత్రకు న్యాయం చేకూర్చాలని సామ్ భావిస్తుందట. ప్రస్తుతం అందుకోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకే సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సమంత చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ‘యశోద’ (Yashoda), ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలను ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ లో నటిస్తుంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ తో హాలీవుడ్కు కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఓ బాలీవుడ్ చిత్రంలోను విక్కీ కౌశల్కు జోడీగా నటించే అవకాశాన్ని ఆమె కొట్టేసిందని సమాచారం.