Mahesh Babuను వంశీ పైడిపల్లి ఒప్పించాడా..?
ABN , First Publish Date - 2022-06-08T14:10:10+05:30 IST
ప్రస్తుతం తెరకెక్కుతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu)ను స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఒప్పించినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu)ను స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఒప్పించినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ స్టార్ హీరో 'తలపతి' విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో ఓ ద్వి భాషా చిత్రం తెరకెక్కుతోంది. వంశీపైడిపల్లి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. వాస్తవంగా సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ - వంశీపైడిపల్లి కాంబినేషన్లో సినిమా రావాల్సింది.
అయితే, ఫైనల్ నరేషన్ నచ్చక వంశీ చెప్పిన కథను మహేశ్ రిజెక్ట్ చేశారు. అదే కథను కోలీవుడ్ హీరో విజయ్ (Vijay) ఇమేజ్కు తగ్గట్టుగా మార్చి ఇటు నిర్మాత దిల్ రాజును అటు హీరో విజయ్ను ఒప్పించారు వంశీపైడుపల్లి. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ కామియో రోల్ ఉండగా, దీనికోసం వంశీపైడిపల్లి మహేశ్ను ఒప్పించినట్టు తెలుస్తోంది. వంశీ చెప్పిన రోల్ నచ్చడంతో విజయ్ సినిమాలో నటించడానికి మహేశ్ ఒకే చెప్పారట. వంశీ - మహేశ్ కలిసి చేసిన 'మహర్షి' (Maharshi) సినిమా భారీ సక్సెస్తో పాటు అవార్డులను దక్కించుకుంది.
అంతేకాదు, సినిమాల విషయం పక్కనపెడితే, ఈ రెండు ఫ్యామిలీల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇక దిల్ రాజు నిర్మాత..కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా. ఇవన్నీ మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం అంటున్నారు. ఇక ఇటీవల సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో వచ్చిన మహేశ్ మంచి కమర్షియల్ సక్సెస్ను అందుకున్నారు. అలాగే, తమిళ హీరో విజయ్ కూడా రీసెంట్గా బీస్ట్ (Beast) సినిమాతో వచ్చారు. కానీ, ఫైనల్ రన్లో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు. కాగా, ప్రస్తుతం చెన్నైలో విజయ్ - వంశీపైడిల్లి సినిమా షూటింగ్ జరుగుతోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్.