ఆసుపత్రిలో... ధర్మేంద్ర...

ABN , First Publish Date - 2022-05-02T03:46:42+05:30 IST

కెరీర్ పరంగా 86 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్ గా ఉన్న సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి ‘హాస్పిటల్ వార్తలు’ రావటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సొషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు, పోస్టులు వెల్లువెత్తాయి...

ఆసుపత్రిలో... ధర్మేంద్ర...

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే, 86 ఏళ్ల లెజెండ్రీ యాక్టర్ నాలుగు రోజుల క్రితమే హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు ఆదివారం హఠాత్తుగా కథనాలు ప్రచారం అయ్యాయి. ధర్మేంద్ర అనారోగ్యానికి కారణాలు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆయన ఔట్ ఆప్ డేంజర్ అని మాత్రం కొందరు చెబుతున్నారు. 


కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన ధర్మేంద్రని చికిత్స నిమిత్తం డాక్టర్లు ఐసీయూలో ఉంచారట. కానీ, తాజా పరిస్థితుల్లో ఆయన్ని ఐసీయూ మరో వార్డుకి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మరికొద్ది రోజుల పాటూ అబర్జ్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేయనున్నారు. 


ధర్మేంద్ర ప్రస్తుతం కరణ్ జోహర్ నిర్మాణంలో ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాలో నటిస్తున్నాడు. ‘షోలే’ తరువాత ఇన్ని దశాబ్దాల అనంతరం జయా బచ్చన్ తో కలసి ఆయన మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు. ‘రాకీ ఔర్ రాణీ...’లో షబానా అజ్మీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా కరణ్ జోహర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రణవీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా అలరించనున్నారు. ఇక కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తో పాటూ మనవడు కరణ్ డియోల్ తో కలసి ‘అప్నే’ సినిమాకు సీక్వెల్ లో కూడా ధర్మేంద్ర కనిపించబోతున్నాడు. కెరీర్ పరంగా 86 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్ గా ఉన్న సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి ‘హాస్పిటల్ వార్తలు’ రావటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సొషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు, పోస్టులు వెల్లువెత్తాయి.    

Updated Date - 2022-05-02T03:46:42+05:30 IST