Dhanush: అక్కడ విజయ్ పాన్ ఇండియా సినిమా వసూళ్లని దాటేసిన ‘తిరు’.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

ABN , First Publish Date - 2022-08-30T18:04:41+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ధనుష్ (Dhanush). ముఖ్యంగా తమిళనాడులో ప్రత్యేకంగా..

Dhanush: అక్కడ విజయ్ పాన్ ఇండియా సినిమా వసూళ్లని దాటేసిన ‘తిరు’.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ధనుష్ (Dhanush). ముఖ్యంగా తమిళనాడులో ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ధనుష్ మూవీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. ధనుష్ తాజాగా నటించిన చిత్రం ‘తిరుచిత్రబలం (Thiruchitrambalam)’. తెలుగులో తిరు (Thitu). మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యామీనన్ (Nithya Menen) హీరోయిన్‌గా నటించింది. రాశి ఖన్నా, భవానీ శంకర్ ముఖ్యపాత్రల్లో నటించారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 18న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైంది.


విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుని విజయవంతంగా దూసుకుపోతుంది. తమిళనాడులో కేవలం 11 రోజుల్లోనే రూ.70 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, తిరుచిత్రంబలం తమిళనాడులో దలపతి విజయ్ (Thalapathy Vijay) పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసిన ‘బీస్ట్’ జీవితకాల కలెక్షన్లను అధిగమించింది. థియేటర్లలో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం ధనుష్ సినిమాకి కలిసి వచ్చినట్లైంది.


ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ ఓ ట్వీట్ పెట్టాడు. అందులో.. ‘విజయ్ దళపతి నటించిన బీస్ట్ జీవితకాల వసూళ్లు రూ.65.45కోట్లని దాటి ధనుష్ మూవీ రూ.70.75 కోట్ల కలెక్షన్లని సాధించింది. దీంతో.. తమిళనాడులో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఏడో స్థానంలో నిలిచింది’ అని రాసుకొచ్చాడు.



Updated Date - 2022-08-30T18:04:41+05:30 IST