పెళ్లిపీటలు ఎక్కనున్న రణబీర్ కపూర్, అలియా భట్.. దీపికా పదుకొనే ఏమందంటే..
ABN , First Publish Date - 2022-04-07T18:36:07+05:30 IST
ప్రస్తుతం బాలీవుడ్ జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నది రణ్బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించే.
ప్రస్తుతం బాలీవుడ్ జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నది రణ్బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించే. వారిద్దరూ ఏప్రిల్ 17న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీరి వివాహం కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్యే జరగనున్నట్లు వినిపిస్తోంది. ఆ మ్యారేజ్కి హాజరయ్యేది వీరేనంటూ నెట్టింట ప్రచారం సైతం జరుగుతోంది. అందులో కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే.. ఈ పెళ్లికి సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. వీరికి సన్నిహితులైన దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ ఈ మ్యారేజ్కి హాజరవుతారా లేదా అనేది. గతంలో దీపిక, రణ్బీర్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. కొద్దికాలం తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. అయితే బ్రేకప్ తర్వాత కూడా వారిద్దరి మధ్య మంచి రిలేషనే కొనసాగింది. అయితే దీపిక, రణ్వీర్ పెళ్లికి మాత్రం ఈ చాక్లెట్ బోయ్ వెళ్లలేదు. దీంతో అతని పెళ్లికి దీపిక దంపతులు వెళ్తారా లేదాని అందరి అనుమానం.
రణ్బీర్ తన రిసెప్షన్కి రాకపోవడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి మేము మాట్లాడుకోలేదు. అంటే.. మా రిసెప్షన్కి ముందు మాట్లాడుకున్నాం. కానీ అతను రాలేదు. అతను అలా చేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. మా మధ్య ఉన్న రిలేషన్ అలాంటిది. ఎక్కువ మాట్లాడకుండానే చాలా అర్థమవుతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.