2019లో ఇండస్ట్రీకి గుడ్ బై! ఇప్పుడు బురఖాలో నెటిజన్స్ ముందుకు!

ABN , First Publish Date - 2021-10-06T03:05:53+05:30 IST

‘దంగల్’ సినిమాలో నటించిన జైరా వసీమ్ రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత తన ఫోటో నెటిజన్స్‌తో షేర్ చేశారు. ఆమె 2019 జూన్‌లో బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. తన విశ్వాసాలు, మతానికి గ్లామర్ ప్రపంచం వ్యతిరేకమంటూ ఆమె తెరుమరుగు అయ్యారు.

2019లో ఇండస్ట్రీకి గుడ్  బై! ఇప్పుడు బురఖాలో నెటిజన్స్ ముందుకు!

‘దంగల్’ సినిమాలో నటించిన జైరా వసీమ్ రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత తన ఫోటో నెటిజన్స్‌తో షేర్ చేశారు. ఆమె 2019 జూన్‌లో బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. తన విశ్వాసాలు, మతానికి గ్లామర్ ప్రపంచం వ్యతిరేకమంటూ ఆమె తెరుమరుగు అయ్యారు. తన ఫోటోలన్నిట్నీ సొషల్ మీడియా నుంచి తొలగించమంటూ... గతేడాది జైరా వసీమ్ తన అభిమానుల్ని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఇంటర్నెట్ నుంచీ ఫోటోలు తీసి వేయటం సాధ్యం కాదని తనకు తెలుసు అంటూనే ఫ్యాన్స్‌ని ఇక మీదట షేర్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేశారు.


2019 తరువాత నుంచీ నటనకు, మీడియా కెమెరాలకు దూరమైన జైరా వసీమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకూ కొటేషన్స్ లాంటివి షేర్ చేస్తూ ఉంటారు. కానీ, ఆమె తాజాగా ఓ బ్రిడ్జ్‌పై తాను నిలబడి ఉన్న పిక్‌ను షేర్ చేశారు. అందులో ఆమె నిండుగా నల్లటి బురఖా ధరించి కనిపించారు. ‘వెచ్చటి అక్టోబర్ సూర్య కాంతి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు... 

Updated Date - 2021-10-06T03:05:53+05:30 IST