ఆయన పొరపాటున సినిమాల్లోకి వచ్చారు.. లేదంటే?: రానా దగ్గుబాటి
ABN , First Publish Date - 2022-02-25T01:46:42+05:30 IST
‘నటుడిగా నాకు నచ్చిన, వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లిపోతున్నాను కానీ.. హీరో ఎలా అవ్వాలా అని ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ల ముందు మెదిలిన హీరో పవన్ కల్యాణే’.. అన్నారు దగ్గుబాటి రానా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్
‘నటుడిగా నాకు నచ్చిన, వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లిపోతున్నాను కానీ.. హీరో ఎలా అవ్వాలా అని ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ల ముందు మెదిలిన హీరో పవన్ కల్యాణే’.. అన్నారు దగ్గుబాటి రానా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యకమానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ...
‘‘నటుడిగా నాకు 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. దర్శకులు చెప్పినట్లు నాకు ఇచ్చిన పాత్రలన్నీ చేసుకెళ్లిపోయాను. ఏదోలా యాక్టర్ అయ్యా. కానీ హీరో ఎలా అవ్వాలనే కాన్సెప్ట్ బుర్రలో తిరుగుతూనే ఉంది. అప్పుడు నా కళ్ల ముందుకొచ్చిన హీరో.... పవన్కల్యాణ్గారు. ఇండియాలో చాలామంది స్టార్లతో కలిసి చేశాను కానీ.. అందులో పవన్ కల్యాణ్గారు డిఫరెంట్. ఇప్పటి వరకూ.. నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇప్పుడు రాబోయే చిత్రాలన్నీ పవన్కల్యాణ్గారి ప్రభావంతో కొత్తగా ఉంటాయి. అలాగే నేను కలిసిన మరో మేధావి త్రివిక్రమ్గారు. ఆయన పొరపాటున సినిమాల్లోకి వచ్చారు కానీ బయట ఉండి ఉంటే రాకెట్లను మార్స్కి ఎగరేసేవారు. అలాంటి తత్వం ఆయనది. ‘భీమ్లా నాయక్’ చిత్రంలో మంచి ఆర్టిస్ట్లతో పనిచేశా. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో ఇండియన్ సినిమాకు హైదరాబాద్ హబ్ అవుతుంది..’’ అని అన్నారు.
కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాగర్. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, మురళీ శర్మ, రావు రమేష్, రఘుబాబు వంటివారు ఇతర పాత్రలలో నటించారు. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు.