పబ్లిక్ సమస్యపై వన్ టు వన్ చర్చలా?.. చిరంజీవికి సీపీఐ నారాయణ హితబోధ

ABN , First Publish Date - 2022-01-15T02:29:58+05:30 IST

సినీ ఇండస్ట్రీలోని అసోసియేషన్స్‌ని కలుపుకుపోకుండా.. ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడ వచ్చి ముఖ్యమంత్రితో పర్సనల్‌గా వన్ టు వన్ మాట్లాడితే.. ఇటువంటి అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి?..’’ అని మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించారు సీపీఐ నారాయణ. ఈ విషయంపై

పబ్లిక్ సమస్యపై వన్ టు వన్ చర్చలా?.. చిరంజీవికి సీపీఐ నారాయణ హితబోధ

‘‘సినీ ఇండస్ట్రీలోని అసోసియేషన్స్‌ని కలుపుకుపోకుండా.. ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడ వచ్చి ముఖ్యమంత్రితో పర్సనల్‌గా వన్ టు వన్ మాట్లాడితే.. ఇటువంటి అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి?..’’ అని మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించారు సీపీఐ నారాయణ. అంతకుముందు వైఎస్ జగన్ తనకు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారనే వార్తలపై చిరంజీవి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని తెలుపుతూ చిరంజీవి చేసిన ట్వీట్‌పై సీపీఐ నారాయణ ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ..


‘‘మెగాస్టార్ చిరంజీవి నాకు మంచి మిత్రుడు. ఆయనిప్పుడు ఓ వివాదంలో పడ్డారు. రాజ్యసభ సీటు నేను ఆశించలేదు.. అంతా అపార్థం చేసుకున్నారంటూ బాధపడుతూ ట్వీట్ చేశారు. నిజమే.. అయితే ఈ సమస్య మీ సొంత సమస్య కాదు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పబ్లిక్ సమస్య. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అన్నప్పుడు.. ఆ ఇండస్ట్రీలో కొన్ని అసోషియేషన్లు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రిని పర్సనల్‌గా వన్ టు వన్ కలిశారు. ఒక టీమ్‌తో ఆయన రాలేదు. మీరు అక్కడ ఏం మాట్లాడారో మాకు ఎలా తెలుస్తుంది? అందుకే ఇటువంటి వివాదం వచ్చింది. నిజంగా సినిమా ఇండస్ట్రీ సమస్య అయితే.. అసోషియేషన్స్‌తో వచ్చి మాట్లాడాలి. లేకపోతే మీ వ్యక్తిగత సమస్యలు మాట్లాడుకోవచ్చు. వచ్చింది ఒక్కడే అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ల్యాండ్ కావాలా? రాజ్యసభ సీటు కావాలా? వంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. ఆ కథనాలలో వాస్తవం లేకపోవచ్చు. చిరంజీవి చెప్పాడు కాబట్టి ఆ కథనాలలో వాస్తవం లేకపోవచ్చు.. కానీ ఊహాగానాలకు దారితీస్తాయా? లేదా? మీరు అలా వెళ్లడం పొరబాటు కదా.. మీ సొంత సమస్య కానప్పుడు.. అసోషియేషన్స్‌ని కలుపుకుపోకుండా మీరు వెళ్లి ఏ విధంగా మాట్లాడతారు? ఎలా పరిష్కారం చేస్తారు? అందుకే అనుమానాలు వచ్చాయి. ఇలాంటి పనులు ఇకపై చేయకండి..’’ అని నారాయణ హితబోధ చేశారు.

Updated Date - 2022-01-15T02:29:58+05:30 IST