మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై Colours Swathi..

ABN , First Publish Date - 2022-07-06T18:36:11+05:30 IST

చాలాకాలం తర్వాత హీరోయిన్ 'కలర్స్' స్వాతి (Colours Swathi) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతుంది. 'కలర్స్' అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతికి అదే ట్యాగ్ అయిపోయింది.

మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై Colours Swathi..

చాలాకాలం తర్వాత హీరోయిన్ 'కలర్స్' స్వాతి (Colours Swathi) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతుంది. 'కలర్స్' అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతికి అదే ట్యాగ్ అయిపోయింది. హీరోయిన్ అయినా కూడా కలర్స్ స్వాతి అని తన మొదటి ప్రోగ్రామ్ పేరును కలిపే పిలుస్తున్నారు. కృష్ణవంశీ (Krishnavamsi) దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్వాతి ఆ తర్వాత వెంకటేశ్ (Venkatesh), త్రిష (Trisha) జంటగా నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో మంచి పాత్రను చేసి గుర్తిపు తెచ్చుకుంది. 


ఆ తర్వాత హీరోయిన్‌గా మారి 'స్వామి రారా', 'కార్తికేయ', 'త్రిపుర' అలాగే, మలయాళంలో 'మోసాయిలే', 'కుదిర మీనుగళ్', 'నార్త్ 24 కాతమ్', 'త్రిషూర్ పూరమ్', 'ఆమెన్' లాంటి సౌత్ సూపర్ హిట్ సినిమాలలో నటించి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్య మళ్ళీ కార్తికేయ సీక్వెల్ సినిమాతో మళ్ళీ స్వాతి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమే.


స్వాతి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్న లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు' (Month Of Madhu). ఈ మూవీలో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా నటిస్తున్నాడు. శ్రీకాంత్ నాగోతి (Srikanth Nagothi) దర్శకత్వం వహిస్తున్నారు. 'భానుమతి అండ్ రామకృష్ణ' సినిమాని నిర్మించిన క్రిషివ్ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ మేకర్స్ పతాకంపై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చూడాలి మరి స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో. 

Updated Date - 2022-07-06T18:36:11+05:30 IST