CM, Bharti Raja: భారతీరాజాకు సీఎం పరామర్శ
ABN , First Publish Date - 2022-09-11T13:15:26+05:30 IST
దర్శక శిఖరం భారతీరాజా(Bharti Raja)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) శనివారం పరామర్శించారు. నగరంలోని నీలాంగరైలో ఉన్న ఆయన
- నీలాంకరైలోని ఇంటికెళ్లిన స్టాలిన్
అడయార్(చెన్నై), సెప్టెంబరు 10: దర్శక శిఖరం భారతీరాజా(Bharti Raja)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) శనివారం పరామర్శించారు. నగరంలోని నీలాంగరైలో ఉన్న ఆయన నివాసానికి సీఎం స్టాలిన్ స్వయంగా వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట సీనియర్ మంత్రి కేఎన్ నెహ్రూ, సినీ గేయ రచయిత వైరముత్తు, భారతీరాజా కుమారుడు మనోజ్ తదితరులు ఉన్నారు. 81 యేళ్ళ భారతీరాజా ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని గత నెల 26వ తేదీన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ శనివారం ఉదయం భారతీరాజా ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తప్పుడు ప్రచారం చేయొద్దు : మనోజ్
భారతీరాజాకు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు చెల్లించలేక తీవ్ర కష్టాలు పడుతున్నట్టు సోషల్ మీడియాలో రేగుతున్న వార్తలను ఆయన కుమారుడు మనోజ్(Manoj) ఖండించారు. తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని విఙ్ఞప్తి చేశారు. తన తండ్రికి వైద్యం కోసం అయిన అన్ని ఖర్చులను తానే స్వయంగా పెట్టుకున్నట్టు తెలిపారు.